నమాజ్ కోసం మసీదుకు వెళ్లిన బాలుడి దారుణ హత్య

- May 05, 2017 , by Maagulf
నమాజ్ కోసం మసీదుకు వెళ్లిన బాలుడి దారుణ హత్య

నమాజ్ కోసం వెళ్లిన బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బండ్లగూడలో కలకలం సృష్టించింది. గత నెల 27న జహంగీరాబాద్ కు చెదిన పన్నెండేళ్ల ఉరూజుద్పద్దీన్ నమాజు కోసం మసీదుకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. బాలుడిని ఇంటి పక్కనే ఉన్న మునీర్ కిడ్నాప్ చేసి హత్య చేశాడని గుర్తించారు. 
మాయమాటలు చెప్పి చిన్నారిని తీసుకెళ్లిన మునీర్‌కు అతడి  తల్లిదండ్రులను డబ్బు ఎలా డిమాండ్ చేయాలో తెలీలేదు. బాలుడిని తిరిగి తీసుకెళ్తతే తనపై కేసు నమోదు చేస్తారని భయపడ్డాడు. దీంతో చిన్నారి గొంతు నులుమి హత్య చేసి మృతదేహాన్ని మురికిగుంటలో పడేశాడు. పోలీసు విచారణలో నిజాలు వెల్లడించాడు. దీంతో గురువారం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి మృతితో మహ్మద్ యావరుద్దీన్ కుటుంబంలో విషాదం అలుముకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com