13న హైదరాబాద్ నగరంలో ఎన్ఆర్ఐ సదస్సు
- May 05, 2017
గల్ఫ్తో పాటు మలేసియా తదితర దేశాలకు వెళ్లిన ఎన్ఆర్ఐల సంక్షేమం, సమస్యలను పరిష్కరించే దిశగా తెలంగాణ రూపొందించే ఎన్ఆర్ఐ పాలసీకి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన వంతుగా సహకరించేందుకు ముందుకొ చ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి సంయుక్తం గా ఈ నెల 13న హైదరాబాద్లో సదస్సును నిర్వహించనుంది. ప్రధానంగా ఎన్ఆర్ఐల భద్రత, సంక్షేమంలో పాటు రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్ఆర్ఐల భాగ స్వామ్యం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, మున్సి పల్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖల మంత్రి కె.తారకరామారావు శుక్రవారం సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.
ప్రధా నంగా సదస్సులో ప్రస్తావించాల్సిన అంశాల పై చర్చించారు. విదేశాలకు వెళ్లే వారికి పాస్పోర్టు మొదలు మైగ్రేషన్ తదితర సదుపాయాలన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేలా నగరంలో విదేశీ భవన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన స్థలాన్ని గుర్తించాలని అధికారు లను ఆదేశించారు. రాష్ట్రంలో, సొంత ప్రాం తాల్లో అభివృద్ధి పను లు చేపట్టేందుకు, తమ వంతు భాగ స్వామ్యంగా విరాళాలు ఇచ్చేందుకు ముందు కు వచ్చే ఎన్ఆర్ఐలకు అనుసంధానకర్త పాత్ర పోషించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









