13న హైదరాబాద్ నగరంలో ఎన్ఆర్ఐ సదస్సు
- May 05, 2017
గల్ఫ్తో పాటు మలేసియా తదితర దేశాలకు వెళ్లిన ఎన్ఆర్ఐల సంక్షేమం, సమస్యలను పరిష్కరించే దిశగా తెలంగాణ రూపొందించే ఎన్ఆర్ఐ పాలసీకి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన వంతుగా సహకరించేందుకు ముందుకొ చ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి సంయుక్తం గా ఈ నెల 13న హైదరాబాద్లో సదస్సును నిర్వహించనుంది. ప్రధానంగా ఎన్ఆర్ఐల భద్రత, సంక్షేమంలో పాటు రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్ఆర్ఐల భాగ స్వామ్యం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, మున్సి పల్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖల మంత్రి కె.తారకరామారావు శుక్రవారం సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.
ప్రధా నంగా సదస్సులో ప్రస్తావించాల్సిన అంశాల పై చర్చించారు. విదేశాలకు వెళ్లే వారికి పాస్పోర్టు మొదలు మైగ్రేషన్ తదితర సదుపాయాలన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేలా నగరంలో విదేశీ భవన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన స్థలాన్ని గుర్తించాలని అధికారు లను ఆదేశించారు. రాష్ట్రంలో, సొంత ప్రాం తాల్లో అభివృద్ధి పను లు చేపట్టేందుకు, తమ వంతు భాగ స్వామ్యంగా విరాళాలు ఇచ్చేందుకు ముందు కు వచ్చే ఎన్ఆర్ఐలకు అనుసంధానకర్త పాత్ర పోషించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







