గల్ఫ్ కార్మికుల సమస్యలపై 9న హైదరాబాద్ లో అఖిలపక్ష సదస్సు

- May 07, 2017 , by Maagulf

'గల్ఫ్ కార్మికుల సంక్షేమం - ప్రభుత్వాల పాత్ర' అనే అంశంపై ఈనెల 9న ఉదయం 10 గం.లకు హైదరాబాద్ నాంపల్లి లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ గోల్డెన్ జూబిలీ హాల్ లో అఖిలపక్ష సెమినార్ జరుగుతుందని ప్రవాసీ మజ్దూర్ యూనియన్ నాయకుడు కడార్ల రంజిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, మాజీ ఇండియన్ అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్ ల నాయకత్వంలో ఈ సెమినార్ జరుగుతుంది. ఈ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు 97000 90072 నెంబర్ కు కాల్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.                        

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com