చైనాలో కోల్ మైన్స్‌లో గ్యాస్ లీక్ 18 మంది మృతి

- May 07, 2017 , by Maagulf
చైనాలో కోల్ మైన్స్‌లో గ్యాస్ లీక్ 18 మంది మృతి

చైనాలో కోల్ మైన్స్‌లో హునాన్‌ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోల్ మైన్స్‌లో పనిచేస్తుండగా.. ప్రమాదవశాత్తు గ్యాస్‌ లీకైంది. దీంతో  అక్కడ పని చేస్తున్న 18 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. కోల్ మైన్స్ గ్యాస్ లీక్ వ్యవహరం పై స్థానికులు పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో  పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మొత్తం 55 కూలీలు పనిచేస్తుండగా....18 మంది స్పాట్ లో చనిపోయారు మిగిత 37 మంది కూలీలను రక్షించి దగ్గరోని హాస్పటల్ తరలించి చికిత్స్ అందిస్తున్నారు. వీరంతా పొగ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. లీకైన గ్యాస్‌ విషవాయువు అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com