అబుదాబీలో యాంటీ సైబర్‌ టెర్రరిజం కాన్ఫరెన్స్‌

- May 12, 2017 , by Maagulf
అబుదాబీలో యాంటీ సైబర్‌ టెర్రరిజం కాన్ఫరెన్స్‌

అబుదాబీలో ఈ నెల 15, 16 తేదీల్లో యాంటీ సైబర్‌ టెర్రరిజం కాన్ఫరెన్స్‌ జరగనుంది. మినిస్టర్‌ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఫండమెంటల్‌ హ్యూమన్‌ రైట్స్‌ మరియు, సైబర్‌ టెర్రిజంని ఎదుర్కొనడంలో అంతర్జాతీయ ప్రమాణాలు వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చ జరగనుంది. సైబర్‌ టెర్రరిజాన్ని అంతం చేసే క్రమంలో అంతర్జాతీయ సమాజం అంతా ఒక్కతాటిపైకి రావాలని, ఇందుకోసం ఈ ఈవెంట్‌ తొలి ప్రయత్నంగా భావించవచ్చునని కాన్ఫరెన్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ అదిల్‌ రషీద్‌ అల్‌ నవోమి చెప్పారు. సైబర్‌ టెర్రరిజంపై పోరాటం చేస్తున్న వివిధ సంస్థలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com