అభిమానులతో సమావేశం కానున్నసూపర్ స్టార్ రజినీకాంత్
- May 15, 2017
2009లో శివాజీ సినిమా సక్సెస్ తర్వాత ఫ్యాన్స్తో సమావేశమైన రజనీ, మళ్లీ ఇన్నాళ్లకు వారికి సమయం కేటాయించారు. ఇవాళ్టి నుంచి మే 19 వరకు చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో 5 రోజుల పాటు బ్యాచ్ల వారీగా తన అభిమాన సంఘాల ప్రతినిధులతో రజనీ భేటీ అవుతున్నారు. గత ఎనిమిదేళ్లలో ఫ్యాన్స్తో కేవలం ఫొటోలు మాత్రమే దిగి వారికి చాలా తక్కువ టైం కేటాయించిన తలైవా.. తాజాగా వారితో సమావేశమయ్యేందుకు ప్రత్యేకంగా 5 రోజులు కేటాయించడం విశేషం. ఈ సమావేశాల్లో తలైవాతో ఫోటో దిగాలని అనుకున్న అభిమానులు తప్పని సరిగా ఐడీ కార్డుతో రావాలని రజినీ అభిమాన సంఘం నోటీసులో పేర్కొంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఆయన అభిమానుల్లో క్రేజ్ చాలా ఉంది. రజినీని స్వయంగా కలుసుకుని ఆయనతో సెల్ఫీ దిగే అవకాశం వస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఎక్కువగా ఆయన అభిమానుల నుంచి చాలా కాలంగా వినిపిస్తోంది. ఇప్పుడీ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ప్రతి ఏడాది అభిమానులను సమావేశపరిచి వారిని రజినీకాంత్ కలుసుకునేవారు. కానీ శివాజీ చిత్రం తరువాత రజిని మళ్లీ అభిమానులతో సమావేశం నిర్వహించలేదు. అభిమానులతో సమావేశంలో రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో రజినీ పొలిటికల్ ఎంట్రీకి అనుకూల వాతావరణం ఉంది. దీంతో తలైనా తన అభిమానులను సంప్రదించి వారి నుంచి సూచనలు సలహాలు తీసుకుంటారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







