దిల్ రాజు బ్యానర్లో హీరో రాజ్ తరుణ్
- May 15, 2017
శతమానం భవతి సినిమా సమయంలో దిల్ రాజు, రాజ్ తరుణ్ మధ్య విబేధాలొచ్చాయన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. శతమానం భవతి సినిమాను ముందుగా రాజ్ తరుణ్ హీరోగా చేయాలని భావించాడు దిల్ రాజు. అయితే చివరి నిమిషంలో శర్వానంద్తో సినిమా చేశాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో రాజ్ తరుణ్ చేతులారా మంచి హిట్ సినిమాను చేజార్చుకున్నాడని భావించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే రాజ్ తరుణ్, దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయబోతున్నాడట. శతమానం భవతి సినిమా సమయంలో అప్పటికే ఏకె ఎంరట్టైన్మెంట్స్తో ఉన్న అగ్రిమెంట్ కారణంగా ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట. అందుకే మరోసారి దిల్ రాజు ఆఫర్ ఇవ్వగానే వెంటనే ఒప్పేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తయిన వెంటనే దిల్ రాజు బ్యానర్లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను స్టార్ట్ చేయనున్నాడు రాజ్ తరుణ్.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







