అబుదాబి రాజును కలిసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
- May 16, 2017
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అబుదాబి రాజును కలుసుకున్నారు. మొట్టమొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా శ్వేతసౌదానికి ఆహ్వానించి ముచ్చటించారు. త్వరలోనే ట్రంప్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. అబుదాబి రాజు జయద్ అల్-నయాన్ శ్వేత సౌదంలోని ఓవల్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ట్రంప్ ఆయనను సాదరంగా హ్వానిస్తూ ‘నయన్ ప్రత్యేకమైన అతిధి.. మెండుగా గౌరవించదగినవారు’ అని ఫొటో సెషన్ సందర్భంగా అన్నారు.
‘ఆయన దేశాన్ని ప్రేమిస్తున్నాను.. మీరు కూడా ఆయన దేశాన్ని ప్రేమించండి. వీటన్నింటికంటే ముందు అమెరికాను ప్రేమించండి.. మనందరికీ అదే ముఖ్యం’ అంటూ ట్రంప్ చెప్పినట్లు యూఎస్ఏ టుడే తెలిపింది. ఇరు దేశాల భద్రత, వాణిజ్య, ఇరు దేశాల్లో పెట్టుబడుల అంశాలపై చర్చించుకున్నారని, ద్వైపాక్షి సంబంధాలపై తీవ్రంగా చర్చిచారని కూడా అది పేర్కొంది. మరోపక్క, అమెరికా రహస్యాలను డోనాల్డ్ ట్రంప్ రష్యాకు లీక్ చేశారని వచ్చిన వార్తలను అమెరికా శ్వేతసౌదం కొట్టిపారేసింది. అవన్నీ కూడా కట్టుకథలేనంటూ తిప్పికొట్టింది.
తాజా వార్తలు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- ఏపీ నూతన సీఎస్గా సాయిప్రసాద్
- ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!









