'జై లవకుశ' నుంచి కెమెరామన్ మురళీధరన్ ఔట్
- May 16, 2017
ఎన్టీఆర్- బాబీ డైరెక్షన్లో రెడీ అవుతున్న ఫిల్మ్ 'జై లవకుశ'. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఫేమస్ కెమెరామన్ మురళీధరన్ తప్పుకున్నట్లు సమాచారం. గతంలో ఈయన స్టార్ హీరోల సినిమాలకు కెమెరామన్గా వ్యవహరించాడు. కొన్ని సీన్ల విషయంలో డైరెక్టర్- కెమెరామన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో మురళీ డ్రాపైనట్టు యూనిట్ చెబుతున్నమాట. వెంటనే ఆలోచనలోపడిన యూనిట్, ఈలోగా ఛోటా కె.నాయుడు సంప్రదించడం ఆయన ఓకే చేయడం కూడా జరిగిపోయింది.
బాబీ సినిమాల్లో కెమెరామన్లు డ్రాప్ కావడం ఇదేం కొత్తకాదు. గతంలో రవితేజ-'పవర్', పవన్కల్యాణ్- 'గబ్బర్సింగ్2' వంటి చిత్రాల్లో బాబీ ఒత్తిడి వల్ల కెమెరామన్ల తప్పుకున్న విషయం తెల్సిందే! ఇప్పుడు జై లవకుశకూ ఆ గాలి సోకింది. మరోవైపు డైరెక్టర్ వల్ల కాదని, నిర్మాత కల్యాణ్రామ్ బావమదిరితో విభేదాలు రావడం వల్లనే కెమెరామన్ తప్పుకున్నాడన్నది అంతర్గత సమాచారం.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







