విస్తారా ఎయిర్ లైన్స్ సమ్మర్ ఆఫర్
- May 16, 2017
వేసవి సెలవుల్లో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆఫర్ల బాట పట్టాయి పలు విమానయాన సంస్థలు. ఇప్పటికే స్పైస్జెట్, ఇండిగో, ఎయిర్ఏషియా, గోఎయిర్ లాంటి సంస్థలు తక్కువ ధరలతో విమాన టికెట్లు ఆఫర్ చేస్తుండగా.. తాజాగా విస్తారా కూడా ఈ జాబితాలో చేరింది. రూ. 999 ప్రారంభ టికెట్ ధరతో ‘మిడ్-సమ్మర్’ సేల్ను ప్రకటించింది.
దేశీయ విమానాల్లో రూ. 999 ప్రారంభ ధరతో ఈ ఆఫర్ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద జమ్ము-శ్రీనగర్, గువాహటి-బగ్దోగ్రా టికెట్ ధర రూ. 999గా ఉంది. ఇక దిల్లీ-చండీగఢ్కు రూ. 1,499, దిల్లీ-లఖ్నవూకు రూ. 1,549, దిల్లీ-అమృత్సర్కు రూ. 1,699 చొప్పున టికెట్ ధరలు ప్రకటించింది. మే 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జూన్ 12, 2017 నుంచి ఫిబ్రవరి 20, 2018 మధ్య విస్తారా విమానాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.
అయితే ఈ ఆఫర్ కింద పరిమిత సంఖ్యలో సీట్లను కేటాయించింది. కేవలం ఎకానమీ క్లాస్లోనే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపింది. ఇటీవలే ఆఫర్డబుల్ లగ్జరీ సేల్ కింద బిజినెస్ క్లాస్ టికెట్ ధరలను విస్తారా 50శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









