విస్తారా ఎయిర్ లైన్స్ సమ్మర్ ఆఫర్
- May 16, 2017
వేసవి సెలవుల్లో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆఫర్ల బాట పట్టాయి పలు విమానయాన సంస్థలు. ఇప్పటికే స్పైస్జెట్, ఇండిగో, ఎయిర్ఏషియా, గోఎయిర్ లాంటి సంస్థలు తక్కువ ధరలతో విమాన టికెట్లు ఆఫర్ చేస్తుండగా.. తాజాగా విస్తారా కూడా ఈ జాబితాలో చేరింది. రూ. 999 ప్రారంభ టికెట్ ధరతో ‘మిడ్-సమ్మర్’ సేల్ను ప్రకటించింది.
దేశీయ విమానాల్లో రూ. 999 ప్రారంభ ధరతో ఈ ఆఫర్ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద జమ్ము-శ్రీనగర్, గువాహటి-బగ్దోగ్రా టికెట్ ధర రూ. 999గా ఉంది. ఇక దిల్లీ-చండీగఢ్కు రూ. 1,499, దిల్లీ-లఖ్నవూకు రూ. 1,549, దిల్లీ-అమృత్సర్కు రూ. 1,699 చొప్పున టికెట్ ధరలు ప్రకటించింది. మే 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జూన్ 12, 2017 నుంచి ఫిబ్రవరి 20, 2018 మధ్య విస్తారా విమానాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.
అయితే ఈ ఆఫర్ కింద పరిమిత సంఖ్యలో సీట్లను కేటాయించింది. కేవలం ఎకానమీ క్లాస్లోనే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపింది. ఇటీవలే ఆఫర్డబుల్ లగ్జరీ సేల్ కింద బిజినెస్ క్లాస్ టికెట్ ధరలను విస్తారా 50శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు
- మహారాష్ట్రలో రైలు బ్రేకుల ఫెయిల్యూర్
- ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి: సీఎం చంద్రబాబు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్కు సర్వం సిద్ధం..!!









