విస్తారా ఎయిర్ లైన్స్ సమ్మర్ ఆఫర్
- May 16, 2017
వేసవి సెలవుల్లో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆఫర్ల బాట పట్టాయి పలు విమానయాన సంస్థలు. ఇప్పటికే స్పైస్జెట్, ఇండిగో, ఎయిర్ఏషియా, గోఎయిర్ లాంటి సంస్థలు తక్కువ ధరలతో విమాన టికెట్లు ఆఫర్ చేస్తుండగా.. తాజాగా విస్తారా కూడా ఈ జాబితాలో చేరింది. రూ. 999 ప్రారంభ టికెట్ ధరతో ‘మిడ్-సమ్మర్’ సేల్ను ప్రకటించింది.
దేశీయ విమానాల్లో రూ. 999 ప్రారంభ ధరతో ఈ ఆఫర్ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద జమ్ము-శ్రీనగర్, గువాహటి-బగ్దోగ్రా టికెట్ ధర రూ. 999గా ఉంది. ఇక దిల్లీ-చండీగఢ్కు రూ. 1,499, దిల్లీ-లఖ్నవూకు రూ. 1,549, దిల్లీ-అమృత్సర్కు రూ. 1,699 చొప్పున టికెట్ ధరలు ప్రకటించింది. మే 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జూన్ 12, 2017 నుంచి ఫిబ్రవరి 20, 2018 మధ్య విస్తారా విమానాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.
అయితే ఈ ఆఫర్ కింద పరిమిత సంఖ్యలో సీట్లను కేటాయించింది. కేవలం ఎకానమీ క్లాస్లోనే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపింది. ఇటీవలే ఆఫర్డబుల్ లగ్జరీ సేల్ కింద బిజినెస్ క్లాస్ టికెట్ ధరలను విస్తారా 50శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







