'బాహుబలి' స్ఫూర్తితో తమిళంలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్
- May 17, 2017
'బాహుబలి' స్ఫూర్తితో తమిళంలోనూ అంతటి భారీ చారిత్రక చిత్రాన్ని అందించాలని కమర్షియల్ చిత్రాల దర్శకు డు సుందర్.సి లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీ తేనాండ్రాల్ ఫిలింస్ బ్యానర్పై రూ.150 కోట్ల్లకుపైగా బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికపై చాలా గ్రాండ్గా ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ బుధవారం ఉదయం కేన్స్కు బయల్దేరింది. ఈ విషయాన్ని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... జయంరవి, ఆర్య, సుందర్.సి ఫోటోలను షేర్ చేశారు. 8వ శతాబ్దం నాటి చారిత్రక కథతో 'సంఘమిత్ర' రూపొందనుంది. సౌందర్యరాశి, అసమాన ధైర్యసాహసి అయిన సంఘమిత్ర తన రాజ్యాన్ని కాపాడుకొనేందుకు చేసిన పోరా టమే ఈ చిత్ర కథ. తమిళ సినిమాకే మకుటంగా ఈ చిత్రాన్ని అత్యంత బ్రహ్మాం డంగా తెరకెక్కించాలని సుందర్.సి కసర త్తులు చేస్తున్నారు. 'బాహుబలి' తరహాలోనే రెండు భాగాలుగా 'సంఘమిత్ర' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రాచీన తమిళ భాషను ఉపయోగించనున్నారు. ఆర్య, జయంరవి హీరోలు కాగా, టైటిల్ రోల్లో శ్రుతిహాసన్ నటించనుంది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ స్వరాలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









