'బాహుబలి' స్ఫూర్తితో తమిళంలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్
- May 17, 2017'బాహుబలి' స్ఫూర్తితో తమిళంలోనూ అంతటి భారీ చారిత్రక చిత్రాన్ని అందించాలని కమర్షియల్ చిత్రాల దర్శకు డు సుందర్.సి లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీ తేనాండ్రాల్ ఫిలింస్ బ్యానర్పై రూ.150 కోట్ల్లకుపైగా బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికపై చాలా గ్రాండ్గా ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ బుధవారం ఉదయం కేన్స్కు బయల్దేరింది. ఈ విషయాన్ని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... జయంరవి, ఆర్య, సుందర్.సి ఫోటోలను షేర్ చేశారు. 8వ శతాబ్దం నాటి చారిత్రక కథతో 'సంఘమిత్ర' రూపొందనుంది. సౌందర్యరాశి, అసమాన ధైర్యసాహసి అయిన సంఘమిత్ర తన రాజ్యాన్ని కాపాడుకొనేందుకు చేసిన పోరా టమే ఈ చిత్ర కథ. తమిళ సినిమాకే మకుటంగా ఈ చిత్రాన్ని అత్యంత బ్రహ్మాం డంగా తెరకెక్కించాలని సుందర్.సి కసర త్తులు చేస్తున్నారు. 'బాహుబలి' తరహాలోనే రెండు భాగాలుగా 'సంఘమిత్ర' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రాచీన తమిళ భాషను ఉపయోగించనున్నారు. ఆర్య, జయంరవి హీరోలు కాగా, టైటిల్ రోల్లో శ్రుతిహాసన్ నటించనుంది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ స్వరాలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు