'బాహుబలి' స్ఫూర్తితో తమిళంలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్
- May 17, 2017
'బాహుబలి' స్ఫూర్తితో తమిళంలోనూ అంతటి భారీ చారిత్రక చిత్రాన్ని అందించాలని కమర్షియల్ చిత్రాల దర్శకు డు సుందర్.సి లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీ తేనాండ్రాల్ ఫిలింస్ బ్యానర్పై రూ.150 కోట్ల్లకుపైగా బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికపై చాలా గ్రాండ్గా ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ బుధవారం ఉదయం కేన్స్కు బయల్దేరింది. ఈ విషయాన్ని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... జయంరవి, ఆర్య, సుందర్.సి ఫోటోలను షేర్ చేశారు. 8వ శతాబ్దం నాటి చారిత్రక కథతో 'సంఘమిత్ర' రూపొందనుంది. సౌందర్యరాశి, అసమాన ధైర్యసాహసి అయిన సంఘమిత్ర తన రాజ్యాన్ని కాపాడుకొనేందుకు చేసిన పోరా టమే ఈ చిత్ర కథ. తమిళ సినిమాకే మకుటంగా ఈ చిత్రాన్ని అత్యంత బ్రహ్మాం డంగా తెరకెక్కించాలని సుందర్.సి కసర త్తులు చేస్తున్నారు. 'బాహుబలి' తరహాలోనే రెండు భాగాలుగా 'సంఘమిత్ర' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రాచీన తమిళ భాషను ఉపయోగించనున్నారు. ఆర్య, జయంరవి హీరోలు కాగా, టైటిల్ రోల్లో శ్రుతిహాసన్ నటించనుంది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ స్వరాలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







