'బాహుబలి' స్ఫూర్తితో తమిళంలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్
- May 17, 2017
'బాహుబలి' స్ఫూర్తితో తమిళంలోనూ అంతటి భారీ చారిత్రక చిత్రాన్ని అందించాలని కమర్షియల్ చిత్రాల దర్శకు డు సుందర్.సి లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీ తేనాండ్రాల్ ఫిలింస్ బ్యానర్పై రూ.150 కోట్ల్లకుపైగా బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికపై చాలా గ్రాండ్గా ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ బుధవారం ఉదయం కేన్స్కు బయల్దేరింది. ఈ విషయాన్ని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... జయంరవి, ఆర్య, సుందర్.సి ఫోటోలను షేర్ చేశారు. 8వ శతాబ్దం నాటి చారిత్రక కథతో 'సంఘమిత్ర' రూపొందనుంది. సౌందర్యరాశి, అసమాన ధైర్యసాహసి అయిన సంఘమిత్ర తన రాజ్యాన్ని కాపాడుకొనేందుకు చేసిన పోరా టమే ఈ చిత్ర కథ. తమిళ సినిమాకే మకుటంగా ఈ చిత్రాన్ని అత్యంత బ్రహ్మాం డంగా తెరకెక్కించాలని సుందర్.సి కసర త్తులు చేస్తున్నారు. 'బాహుబలి' తరహాలోనే రెండు భాగాలుగా 'సంఘమిత్ర' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రాచీన తమిళ భాషను ఉపయోగించనున్నారు. ఆర్య, జయంరవి హీరోలు కాగా, టైటిల్ రోల్లో శ్రుతిహాసన్ నటించనుంది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ స్వరాలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









