సీనియర్ నటుడు కె.కె. శర్మ కన్నుమూత
- May 18, 2017
సహాయ పాత్రల్లో రాణించిన సీనియర్ నటుడు కె.కె. శర్మ (84) గురువారం ఉదయం వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్లో మృతి చెందారు. కాకినాడకు చెందిన ఆయన పూర్తి పేరు కన్నెవల్లి కామేశ్వరశర్మ. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సుమారు 500 చిత్రాల్లో నటించిన శర్మ, సినిమాల్లో అడుగుపెట్టక ముందు రైల్వేలో డ్రైవర్గా పనిచేశారు. ప్రవృత్తిగా నాటకాలు ఆడేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ సినీ రంగంలోకి వచ్చారు. నటునిగా ఆయన తొలి చిత్రం 'కంచుకోట' (1967). ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించినా, తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువ చిత్రాల్లో హాస్యాన్ని పంచారు.
'ఇన్ స్పెక్టర్ భార్య', 'బిల్లా రంగా', 'చుట్టాలబ్బాయి', 'రాజకీయ చదరంగం', 'స్వాతి కిరణం', 'పుణ్యభూమి నా దేశం', 'ఆపద్బాంధవుడు', 'అసెంబ్లీ రౌడీ', 'ముద్దుల మావయ్య' తదితర చిత్రాల్లో పోషించిన పాత్రలు ఆయనకు పేరు తెచ్చాయి. మిత్రులతో కలిసి ఆయన 'గోలనాగమ్మ' (1981) చిత్రాన్ని నిర్మించారు కూడా. సుదీర్ఘ కాలం సినీ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుకోలేక పోయారని సన్నిహితులు తెలిపారు. వృద్ధాప్యం కారణంగా కొన్నేళ్లుగా అవకాశాలు తగ్గిపోయాయి.
ఈ నేపథ్యంలో ఆయనకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పింఛను అందిస్తూ వస్తోంది. ఆయన అంత్యక్రియలు శుక్రవారం జరగనున్నాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









