'ఆరడుగుల బుల్లెట్' కు థియేటర్స్ కరువు..

- May 19, 2017 , by Maagulf
'ఆరడుగుల బుల్లెట్' కు థియేటర్స్ కరువు..

అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే థియేటర్స్ సంఖ్యా ఎక్కువ..అలాంటిది గోపీచంద్ నటించిన కొత్త విడుదల చేయాలంటే థియేటర్స్ దొరకలేదట. గోపీచంద్ - నయనతార జంటగా బి. గోపాల్ దర్శకత్వం లో తెరకెక్కిన 'ఆరడుగుల బుల్లెట్' మూవీ ఈరోజు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆఖరి నిమిషం థియేటర్స్ దొరకక రిలీజ్ ను వాయిదా చేశారట.
గత నెల 28 న విడుదలైన బాహుబలి హావ ఇంకా తగ్గలేదు..ఇప్పటికి హౌస్ కలెక్షన్స్ రావడం తో చాల చోట్ల ఈ సినిమా ఇంకా థియేటర్స్ లలో నడుస్తుండడం , నిఖిల్ - సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన కేశవ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొని ఉండడం చాల వరకు థియేటర్స్ లలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. దీంతో ఎటువంటి అంచనాలు లేని 'ఆరడుగుల బుల్లెట్' కు థియేటర్స్ దొరకలేదని తెలుస్తుంది..మరి కొత్త డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com