అతివేగమే ప్రాణాలను తీసిందని ధృవీకరించిన బెంజ్ ప్రతినిధులు

- May 19, 2017 , by Maagulf
అతివేగమే ప్రాణాలను తీసిందని ధృవీకరించిన బెంజ్ ప్రతినిధులు

బాప్‌రే!.. అంత వేగమా?.. అంటూ నిషిత్ కారు ప్రమాదంపై బెంజ్ కంపెనీ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. ఎపి మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ్ కారు యాక్సిడెంట్ పై పరిశీలించేందుకు జర్మనీ నుంచి వచ్చిన మెర్సిడెస్ బెంజ్ ప్రతినిధులు జూబ్లీహిల్స్‌లోని యాక్సిడెంట్ స్పాట్ ను, నుజ్జునుజ్జయిన కారుని పరిశీలించారు. జపాన్, హాంకాంగ్, ఢిల్లీ, పుణెకు చెందిన బెంజ్ కార్ల నిపుణులు, ఓ లీగల్ అడ్వైజర్‌తో కూడిన పదిమంది సభ్యుల బృందం ప్రమాదం తీరుని పరిశీలించింది. ప్రమాదం జరిగిన సమయలో కారు 210 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న విషయం తెలిసి అవాక్కయ్యారు. ట్రాఫిక్‌లో అంతవేగం ఎలా సాధ్యపడిందని ఆరా తీయగా, తెల్లవారుజామున కావడంతో ట్రాఫిక్ ఉండదని పోలీసులు వారికి వివరించారు. మెట్రో పిల్లర్ నిర్మాణం, మూలమలుపు, వర్షం కురిసిన సమయంలో రోడ్డు పరిస్థితి తదితర వివరాలను మెట్రో అధికారుల నుంచి సేకరించారు. కారు వేగం గంటకు 80-120 కిలోమీటర్ల మధ్య ఉన్నట్టయితే ఆయన బతికే అవకాశం ఉండేదని, కారులోని సెక్యూరిటీ సిస్టం, ఎయిర్‌బ్యాగ్స్, సీటు బెల్టులు సరిగానే పనిచేస్తున్నాయని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com