3 యూఏఈ న్యాయ సంస్థలకు ప్రతిష్టాత్మక పురస్కారాలు
- May 19, 2017
యూఏఈకి చెందిన మూడు న్యాయ సంస్థలు ప్రతిష్టాత్మక మిడిల్ ఈస్ట్ లీగల్ అవార్డ్స్ని గెలుచుకున్నాయి. దుబాయ్లో జరిగిన ఈ కార్యక్రమానికి 400 మందికి పైగా న్యాయవాదులు హాజరయ్యారు. లండన్కి చెందిన బిజినెస్ లా న్యస్ వెబ్సైట్, లీగల్ వీక్ - అసోసియేషన్ ఆఫ్ కార్పొరేట్ కౌన్సెల్ మిడిల్ ఈస్ట్ చాప్టర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. అమెరికన్ లఆయర్ సంస్థ సహాయ సహకారాలు అందించింది. డీన్ స్టెల్ఫాక్స్, జనరల్ కౌన్సెల్, దుబాయ్ వరల్డ్ సెంటర్ అవార్డుల ప్యానెల్ జడ్జిలుగా వ్యవహరించారు. హదెఫ్ అండ్ పార్టనర్స్ కార్పొరేట్ మరియు రియల్ ఎస్టేట్ కేటగిరీలో అవార్డులు దక్కించుకుంది. బాకర్ మెకన్జీ హబీబ్ అల్ ముల్లా లిటిగేషన్ టీమ్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది. అల్ తమిమి అండ్ కంపెనీ - రీజినల్ లా ఫర్మ్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలో పురస్కారం గెలుచుకుంది. ఈ పురస్కారాలు దక్కడం పట్ల ఆయా సంస్థల ప్రతినిథులు హర్షం వ్యక్తం చేశారు. మెరుగైన న్యాయసేవలు అందించడంలో తమ తమ సంస్థలు ప్రత్యేక చొరవ చూపిస్తున్నాయని వారు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!







