కార్న్ ప్రాన్స్
- May 20, 2017
కావలసిన పదార్థాలు: పెద్ద రొయ్యలు - 2, కూరగాయలు ఉడికించిన నీరు -400 గ్రా., అల్లం - 10 గ్రా., వెల్లుల్లి -10 గ్రా., మొక్కజొన్నపిండి - 1 టేబుల్ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా.
రొయ్యలకు పట్టించడానికి: మొక్కజొన్న పిండి - 30 గ్రా., తెల్లసొన - 2 గుడ్లవి, ఉప్పు రుచికి తగినంత.
తయారుచేసే విధానం: రొయ్యల్ని ముందుగా పొట్టుతీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలో మొక్కజొన్నపిండి, గుడ్ల తెల్లసొన, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ జారులో రొయ్యల్ని ముంచి, నూనెలో 80 శాతం దాకా వేగించాలి. ఇపడు మరో పాత్రలో టేబుల్ స్పూను నూనె వేసి అల్లం, వెలుల్లి ముక్కల్ని వేగించి కూరగాయలు ఉడికించిన నీటిని కలపాలి. నీళ్లు మసులుతుండగా రొయ్యల్ని ఇందులో వేసి మిగతా 20 శాతం ఉడికించాలి. ఒక టేబుల్ స్పూను మొక్కజొన్నపిండి నీళ్లలో కలిపివేసి కాసేపుంచి దించేయాలి. ఇది అన్నంలోకి నంజుకోడానికి బాగుంటుంది..
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









