జూన్ 1 నుండి ఆరుబయట పనిచేసే కార్మికులకు మధ్యాహ్నం మూడు గంటల విరామం

- May 22, 2017 , by Maagulf
జూన్ 1 నుండి ఆరుబయట పనిచేసే  కార్మికులకు మధ్యాహ్నం మూడు గంటల  విరామం

 మస్కట్:ఎండలలో వెలుపల పనిచేసే కార్మికుల కోసం మధ్యాహ్నవిరామ నిబంధన  జూన్ 1 వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదివారం మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్లో  ప్రకటించారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకుఅధిక ఉష్ణోగ్రతలు నమోదు కాబడుతున్న సమయాలలో  నిర్మాణ స్థలాలలో మరియు బహిరంగ ప్రదేశాలలో పనిచేయకూడదని పేర్కొంది. కార్మికుల వృత్తిపరమైన ఆరోగ్య మరియు భద్రతకు ప్రతి సంవత్సరం ఈ మంత్రిత్వశాఖ నిర్వహిస్తుంది. ప్రస్తుత వేసవిలో యెండల ధాటికి  పాదరసం స్థాయి 40  డిగ్రీల సెంటీగ్రేడ్ పైకి చేరుకొంది. ఎండలలో వెలుపల పనిచేసే కార్మికులు జూన్ 1 వ తేదీ నుండి  మూడు నెలల పాటు  మధ్యాహ్నవిరామ నిబంధన ప్రారంభమవుతుంది. మంత్రిత్వ శాఖ నుండి వెలువడిన ఈ చల్లని వార్తగా మారింది.నిర్మాణ మరియు ఎండలలో ఆరుబయట కష్టించి పనిచేసే వేలాదిమంది కార్మికులకు ఎంతో ఉపశమనం కలిగించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com