‘ది మహాభారత’ సినిమాని విడుదల కానివ్వం
- May 23, 2017
రూ.1000 కోట్ల సినిమాకి అప్పుడే చిక్కులు
భారతీయ చిత్రపరిశ్రమలో తొలిసారి రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించనున్న ‘ది మహాభారత’ సినిమాకి చిత్రీకరణ మొదలవకుండానే అడ్డంకులు వస్తున్నాయి. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎం.టి వాసుదేవన్ నాయర్ రచించిన ‘రాందమూళం’ నవల ఆధారంగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి మహాభారత అని పేరుపెడితే వూరుకోం అంటూ కేరళకు చెందిన హిందు ఐక్యవేది సంఘం హెచ్చరించింది.
మహాభారత పేరు పెడితే సినిమాను విడుదల కానివ్వమంటూ సంఘం అధ్యక్షురాలు కె.పి శశికళ ప్రకటించారు. ‘నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమా ‘రాందమూళం’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నప్పుడు చిత్రానికి ఆ పేరే పెట్టాలి. అంతేకానీ వేద వ్యాసుడు రాసిన మహాభారతం పేరు ఎలా పెడతారు? మా మాటలుపట్టించుకోకుండా అదే పేరు పెడితే సినిమా థియేటర్లలో ఆడనివ్వం.’ అని హెచ్చరించారు.
‘రాందమూళం’ నవల పాండవుల్లో రెండోవాడైన భీముడి గురించే ఉంటుంది. యూఏఈకి చెందిన భారతీయ వ్యాపారవేత్త బి.ఆర్ శెట్టి ఈ సినిమాని రూ.1000 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.ఎ. శ్రీకుమార్ మేనన్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో భీముడి పాత్రలో మోహల్లాల్ నటించనున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తారు. 2018 సెప్టెంబర్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. 2020లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









