2000 మంది ముస్లింలతో యోగా చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ

- May 24, 2017 , by Maagulf
2000 మంది ముస్లింలతో యోగా చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న లఖ్నవూలోని అంబేడ్కర్ మైదానంలో జరిగే కార్యక్రమంలో 2వేల మంది ముస్లిం మతపెద్దలతో కలిసి ప్రధాని నరేంద్రమోదీ యోగాసనాలు వేయనున్నారు. దీనిలో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొంటారు. ముస్లింలతో పాటు హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, యూదులు కూడా కార్యక్రమానికి హాజరవుతారని ఆయుష్ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆరెస్సెస్ మద్దతు ఉన్న స్వచ్ఛంద సంస్థ- ఆయుష్మాన్, యూపీ సర్కారు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకారాన్ని అందిస్తున్నాయి. ఈసారి యోగా దినోత్సవంలో ఆసనాలు వేయడానికి పెద్దఎత్తున ప్రజలు తరలి వస్తారని భావిస్తూ దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. భిన్న మతాలకు చెందిన ప్రజలు ఒకే చోట పెద్దసంఖ్యలో చేరి యోగా చేయడాన్ని ప్రపంచ రికార్డుగా గుర్తించేందుకు ‘గిన్నిస్ బుక్’ ప్రతినిధులూ లఖ్నవూకు రాబోతున్నారు. మరోపక్క ఒకప్పుడు దంతధావనానికి విస్తృతంగా ఉపయోగించిన వేప పుల్లల్ని మళ్లీ ఇప్పుడు కొన్ని బ్రాండ్ల పేరుతో అందుబాటులోకి తీసుకురావాలని ఆయుష్ మంత్రిత్వశాఖ నిర్ణయించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com