కువైట్ లో కడప వాసి మృతి
- May 24, 2017
ఎడారి దేశంలో అడుగుపెట్టిన ప్రవాసాంధ్రులు.. కంపెనీలు మూత పడడంతో అక్కడే ఉండలేక.. తిరగి రాలేక నానాపాట్లు పడుతున్నారు. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో అక్కడే కన్నుమూశాడు. మరణించే సమయానికి వీసా కూడా లేకపోవడంతో దాదాపు నెల రోజుల తర్వాత అతడి మృతదేహం స్వదేశానికి వచ్చింది. కడప జిల్లా నగిరిపాడు గ్రామానికి చెందిన పెద్దబుద్ది లక్ష్మీకర్ దశాబ్దానికిపైగా కువైట్లో ఓ నిర్మాణ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆ కంపెనీ రెండేళ్ల క్రితం బ్లాక్ లిస్ట్లో పడింది. దీంతో అతడు రోడ్డున పడ్డాడు. ఇటీవలే లక్ష్మీకర్ రెసిడెన్సీ వీసా గడువు కూడా పూర్తయింది. మరోవైపు కొన్ని నెలలుగా అతడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో వీసా రెన్యువల్ చేయించుకోలేక..
కనీసం స్వస్థలానికి రాలేక తీవ్ర మనోవేదనతో అనారోగ్యం పాలయ్యాడు. గత నెల 29న గుండెపోటుతో మరణించాడు. వీసా లేకపోవడం, ఇతర అధికార లాంఛనాలు పూర్తి కావడానికి చాలా సమయం తీసుకోవడంతో దాదాపు నెల రోజుల తర్వాత బుధవారం తెల్లవారు జామున లక్ష్మీకర్ మృతదేహాన్ని చెన్నైకు పంపారు. ఈ మేరకు కువైట్లోని రాయలసీమ ప్రవాసీ సంక్షేమ మండలి అధ్యక్షుడు దుగ్గి గంగాధర్ తెలిపారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









