కువైట్ లో కడప వాసి మృతి
- May 24, 2017
ఎడారి దేశంలో అడుగుపెట్టిన ప్రవాసాంధ్రులు.. కంపెనీలు మూత పడడంతో అక్కడే ఉండలేక.. తిరగి రాలేక నానాపాట్లు పడుతున్నారు. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో అక్కడే కన్నుమూశాడు. మరణించే సమయానికి వీసా కూడా లేకపోవడంతో దాదాపు నెల రోజుల తర్వాత అతడి మృతదేహం స్వదేశానికి వచ్చింది. కడప జిల్లా నగిరిపాడు గ్రామానికి చెందిన పెద్దబుద్ది లక్ష్మీకర్ దశాబ్దానికిపైగా కువైట్లో ఓ నిర్మాణ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆ కంపెనీ రెండేళ్ల క్రితం బ్లాక్ లిస్ట్లో పడింది. దీంతో అతడు రోడ్డున పడ్డాడు. ఇటీవలే లక్ష్మీకర్ రెసిడెన్సీ వీసా గడువు కూడా పూర్తయింది. మరోవైపు కొన్ని నెలలుగా అతడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో వీసా రెన్యువల్ చేయించుకోలేక..
కనీసం స్వస్థలానికి రాలేక తీవ్ర మనోవేదనతో అనారోగ్యం పాలయ్యాడు. గత నెల 29న గుండెపోటుతో మరణించాడు. వీసా లేకపోవడం, ఇతర అధికార లాంఛనాలు పూర్తి కావడానికి చాలా సమయం తీసుకోవడంతో దాదాపు నెల రోజుల తర్వాత బుధవారం తెల్లవారు జామున లక్ష్మీకర్ మృతదేహాన్ని చెన్నైకు పంపారు. ఈ మేరకు కువైట్లోని రాయలసీమ ప్రవాసీ సంక్షేమ మండలి అధ్యక్షుడు దుగ్గి గంగాధర్ తెలిపారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







