కువైట్ లో కడప వాసి మృతి

- May 24, 2017 , by Maagulf
కువైట్ లో కడప వాసి మృతి

ఎడారి దేశంలో అడుగుపెట్టిన ప్రవాసాంధ్రులు.. కంపెనీలు మూత పడడంతో అక్కడే ఉండలేక.. తిరగి రాలేక నానాపాట్లు పడుతున్నారు. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో అక్కడే కన్నుమూశాడు. మరణించే సమయానికి వీసా కూడా లేకపోవడంతో దాదాపు నెల రోజుల తర్వాత అతడి మృతదేహం స్వదేశానికి వచ్చింది. కడప జిల్లా నగిరిపాడు గ్రామానికి చెందిన పెద్దబుద్ది లక్ష్మీకర్‌ దశాబ్దానికిపైగా కువైట్లో ఓ నిర్మాణ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆ కంపెనీ రెండేళ్ల క్రితం బ్లాక్‌ లిస్ట్‌లో పడింది. దీంతో అతడు రోడ్డున పడ్డాడు. ఇటీవలే లక్ష్మీకర్‌ రెసిడెన్సీ వీసా గడువు కూడా పూర్తయింది. మరోవైపు కొన్ని నెలలుగా అతడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో వీసా రెన్యువల్‌ చేయించుకోలేక..

కనీసం స్వస్థలానికి రాలేక తీవ్ర మనోవేదనతో అనారోగ్యం పాలయ్యాడు. గత నెల 29న గుండెపోటుతో మరణించాడు. వీసా లేకపోవడం, ఇతర అధికార లాంఛనాలు పూర్తి కావడానికి చాలా సమయం తీసుకోవడంతో దాదాపు నెల రోజుల తర్వాత బుధవారం తెల్లవారు జామున లక్ష్మీకర్‌ మృతదేహాన్ని చెన్నైకు పంపారు. ఈ మేరకు కువైట్లోని రాయలసీమ ప్రవాసీ సంక్షేమ మండలి అధ్యక్షుడు దుగ్గి గంగాధర్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com