మధ్యదరాసముద్రంలో ఓ నౌక మునిగి 34 మంది శరణార్థులు మృతి
- May 24, 2017
రోమ్, మే 24: మధ్యదరాసముద్రంలో ఓ నౌక మునిగిపోయిన ఘటనలో 34 మంది శరణార్థులు మృతి చెందారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. నౌకలో సామర్థ్యానికి మించి శరణార్థులు ప్రయాణిస్తుండటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని ఇటాలియన్ కోస్ట్కార్డ్ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు. లిబియా తీరప్రాంతానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. 34 మృతదేహాలను వెలికితీశామని, దాదాపు 200 మంది ప్రజలు సముద్రంలో పడిపోయారని చెప్పారు. ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 500 నుంచి 700 మంది వరకు శరణార్థులు ఉన్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభించామని, శరణార్థులకు లైఫ్జాకెట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









