మధ్యదరాసముద్రంలో ఓ నౌక మునిగి 34 మంది శరణార్థులు మృతి
- May 24, 2017
రోమ్, మే 24: మధ్యదరాసముద్రంలో ఓ నౌక మునిగిపోయిన ఘటనలో 34 మంది శరణార్థులు మృతి చెందారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. నౌకలో సామర్థ్యానికి మించి శరణార్థులు ప్రయాణిస్తుండటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని ఇటాలియన్ కోస్ట్కార్డ్ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు. లిబియా తీరప్రాంతానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. 34 మృతదేహాలను వెలికితీశామని, దాదాపు 200 మంది ప్రజలు సముద్రంలో పడిపోయారని చెప్పారు. ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 500 నుంచి 700 మంది వరకు శరణార్థులు ఉన్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభించామని, శరణార్థులకు లైఫ్జాకెట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









