మధ్యదరాసముద్రంలో ఓ నౌక మునిగి 34 మంది శరణార్థులు మృతి
- May 24, 2017
రోమ్, మే 24: మధ్యదరాసముద్రంలో ఓ నౌక మునిగిపోయిన ఘటనలో 34 మంది శరణార్థులు మృతి చెందారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. నౌకలో సామర్థ్యానికి మించి శరణార్థులు ప్రయాణిస్తుండటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని ఇటాలియన్ కోస్ట్కార్డ్ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు. లిబియా తీరప్రాంతానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. 34 మృతదేహాలను వెలికితీశామని, దాదాపు 200 మంది ప్రజలు సముద్రంలో పడిపోయారని చెప్పారు. ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 500 నుంచి 700 మంది వరకు శరణార్థులు ఉన్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభించామని, శరణార్థులకు లైఫ్జాకెట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు
తాజా వార్తలు
- డ్రోన్ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత









