సూపర్ స్టార్ కి బీజేపీ బంపర్ ఆఫర్
- May 25, 2017
సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై సర్వత్రా చర్చ నడుస్తోంది. రాజకీయాల్లోకి రావాలని కొందరు..రావొద్దని మరికొందరు తమిళనాడులో ఆందోళన చేస్తుండటంతో హాట్ టాపిక్కయ్యింది. తలైవా బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మంచిదేనని..బీజేపీలో చేరితే మరింత ఆనందమని కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ అన్నారు.
తమిళనాడులో రాజకీయ సందిగ్ధత ఉన్నప్పుడు రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకోవడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు. రజినీకి విశేష ప్రజాధరణ ఉందని..బీజేపీలో చేరితో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంలో అనుమానమే లేదని కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. అయితే అంతిమ నిర్ణయం పార్టీ తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.
రజనీకాంత్ బీజేపీలో చేరకుండా వీసీకే నేత తిరుమావళన్ కుల రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అన్ని కులాలు, మతాలకు చెందినవారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
మరోవైపు..అన్నాడీఎంకేలో చీలికలు వచ్చేలా కనిపిస్తుండంతో పన్నీర్ వర్గం వ్యూహాలు రచిస్తోంది. పళనిస్వామని ప్రభుత్వంపై పార్టీలో తలెత్తుతున్న తిరుగుబాటు ధోరణులను నిశితంగా పరిశీలిస్తోంది. అన్నాడీఎంకేలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మల్చుకునే విషయమై బుధవారం తనవర్గంతో పన్నీర్ సెల్వం సమగ్రంగా చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









