'మామ్' చిత్రం కోసం నాలుగు భాషల్లో డబ్బింగ్ చెబుతున్ననటి శ్రీదేవి
- May 25, 2017
ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై 'మామ్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జూలై 7న తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో వరల్డ్వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. కాగా, శ్రీదేవి నాలుగు భాషల్లోనూ తన పాత్రకు తనే డబ్బింగ్ చెబుతుండడం విశేషం.
నటిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుబోతున్న శ్రీదేవి 'తునైవన్' అనే తమిళ్ చిత్రంలో ఛైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమయ్యారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా ఎన్నో భాషల్లో నటించిన శ్రీదేవికి 'మామ్' 300వ చిత్రం. శ్రీదేవి మొదటి చిత్రం విడుదలైన తేదీ జూలై 7, 1967. శ్రీదేవి భర్త, 'మామ్' చిత్ర నిర్మాత బోనీకపూర్ ఈ చిత్రాన్ని శ్రీదేవి తొలి చిత్రం విడుదలైన తేదీ జూలై 7న విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
శ్రీదేవికి దేశవ్యాప్తంగా వున్న ఫాలోయింగ్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు, తమిళ్, మలయాళంలలో కూడా 'మామ్' చిత్రాన్ని ఒకేరోజున విడుదల చేస్తున్నారు. 'మామ్' శ్రీదేవికి 300వ సినిమా కావడం, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, తన మొదటి సినిమా విడుదలైన రోజునే 'మామ్' చిత్రాన్ని కూడా విడుదల చేయాలని ప్లాన్ చేయడం...ఇలా ఎన్నో ప్రత్యేకతలు వున్న ఈ సినిమా కోసం నాలుగు భాషల్లోనూ తన డబ్బింగ్ చెప్పాలని శ్రీదేవి నిర్ణయించుకున్నారు.
ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అభిమన్యు సింగ్, సజల్ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి, ఎడిటింగ్: మోనిసా బల్ద్వా, కథ: రవి ఉద్యవార్, గిరీష్ కోహ్లి, కోన వెంకట్, స్క్రీన్ప్లే: గిరీష్ కోహ్లి, నిర్మాతలు: బోనీ కపూర్, సునీల్ మన్చందా, నరేష్ అగర్వాల్, ముఖేష్ తల్రేజా, గౌతమ్ జైన్, దర్శకత్వం: రవి ఉద్యవార్.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









