యోగా దినోత్సవం: మస్కట్ లో ఇండియన్ ఎంబసీ ఈవెంట్
- May 25, 2017ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రతి ఇండియన్ ఎంబసీలోనూ ఓ యోగా టీచర్ని ఏర్పాటు చేసి, సంవత్సరమంతా యోగా సెషన్స్ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందని ఒమన్లో భారత రాయబారి ఇంద్రా మణి పాండే చెప్పారు. మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న నిర్వహించనున్నట్లు వెల్లడించిన సందర్భంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 డిసెంబర్ 11న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, 69/131 రిజల్యూషన్స్ని ఆమోదించింది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానం చేస్తూ. మస్కట్లో ఇండియన్ ఎంబసీ ప్రతి ఏడాదీ, ఒమన్కి చెందిన యోగా ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్తో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వమిస్తూ వస్తోంది. 3000 మంది ఒమనీయులు, ఇండియన్స్, ఇతర దేశాలకు చెందినవారితో కలిసి భారీ స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది కూడా అంతకన్నా ఘనంగా ఒమన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద ఉదయం 8 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఎంబసీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు