మల్లి మాంచెస్టర్ కాలేజీలో బాంబు భయం
- May 25, 2017
నిన్న కాక మొన్నే ఒక సంగీత కార్యక్రమంలో బాంబు పేలుడుతో ఉలిక్కిపడ్డ మాంచెస్టర్ నగరం మరోసారి భయంతో చిగురుటాకులా వణికిపోయింది. ఇంగ్లండ్లోని మాంచెస్టర్ నగర శివార్లలో గల ట్రాఫర్డ్ నగరంలో ఒక కాలేజీలో బాంబు ఉన్నట్లు పోలీసులకు ఫోన్ వచ్చింది. వెంటనే బాంబు నిర్వీర్య దళం అక్కడకు చేరుకుని అనుమానాస్పదంగా కనిపించిన ప్యాకెట్ను గుర్తించి, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే అందరూ అనుమానించినట్లుగా అందులో బాంబు ఏమీ లేదని బ్రిటిష్ ఆర్మీకి చెందిన బాంబు డిస్పోజల్ నిపుణులు చెప్పారు.
మాంచెస్టర్ ఎరెనాలో జరిగిన బాంబు పేలుడులో 22 మంది మరణించడం, మరో 64 మంది గాయపడటంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో కలకలం రేగింది. దాంతో అనుమానాస్పద స్థితిలో ఏ వస్తువు కనిపించినా భయపడుతున్నారు. తాజాగా కాలేజి ఘటనలోనూ ఇలాగే జరిగింది. ఎవరికీ సంబంధం లేకుండా ఒక ప్యాకెట్ కనిపించడంతో వెంటనే అప్రమత్తమై పోలీసులకు తెలిపారు. అయితే అందులో బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









