మల్లి మాంచెస్టర్ కాలేజీలో బాంబు భయం
- May 25, 2017నిన్న కాక మొన్నే ఒక సంగీత కార్యక్రమంలో బాంబు పేలుడుతో ఉలిక్కిపడ్డ మాంచెస్టర్ నగరం మరోసారి భయంతో చిగురుటాకులా వణికిపోయింది. ఇంగ్లండ్లోని మాంచెస్టర్ నగర శివార్లలో గల ట్రాఫర్డ్ నగరంలో ఒక కాలేజీలో బాంబు ఉన్నట్లు పోలీసులకు ఫోన్ వచ్చింది. వెంటనే బాంబు నిర్వీర్య దళం అక్కడకు చేరుకుని అనుమానాస్పదంగా కనిపించిన ప్యాకెట్ను గుర్తించి, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే అందరూ అనుమానించినట్లుగా అందులో బాంబు ఏమీ లేదని బ్రిటిష్ ఆర్మీకి చెందిన బాంబు డిస్పోజల్ నిపుణులు చెప్పారు.
మాంచెస్టర్ ఎరెనాలో జరిగిన బాంబు పేలుడులో 22 మంది మరణించడం, మరో 64 మంది గాయపడటంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో కలకలం రేగింది. దాంతో అనుమానాస్పద స్థితిలో ఏ వస్తువు కనిపించినా భయపడుతున్నారు. తాజాగా కాలేజి ఘటనలోనూ ఇలాగే జరిగింది. ఎవరికీ సంబంధం లేకుండా ఒక ప్యాకెట్ కనిపించడంతో వెంటనే అప్రమత్తమై పోలీసులకు తెలిపారు. అయితే అందులో బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన