రవితేజ కొత్త సినిమా 'టచ్ చేసి చూడు'
- May 25, 2017
రవితేజ స్పీడ్ పెంచారు. ఆ మధ్య నటనకి కొంత విరామం ఇచ్చిన ఆయన ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహిస్తున్న 'టచ్ చేసి చూడు' చిత్రం ఒకటి. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బేనరుపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ వచ్చే నెల 5న ప్రారంభం కానుంది. 20 రోజుల పాటు హైదరాబాద్, పాండిచ్చేరిలో జరిగే షూటింగ్లో కీలక సన్నివేశాలు, ఒక ఫైట్, ఛేజ్ చిత్రీకరిస్తామని నిర్మాతలు చెప్పారు. డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రవితేజ తన అభిమానుల్ని అలరించే అద్భుతమైన పాత్రను పోషిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









