సౌదీ అరేబియాలో ఆంధ్ర మహిళకు కష్టాలు
- May 25, 2017
సౌదీ అరేబియా:సౌదీలోని ఓ ఇంట్లో పాచిపని చేసేందుకు వెళ్లిన మహిళ అక్కడ నరకయాతన అనుభవిస్తోంది. నెల్లూరు జిల్లా కావలి పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీకి చెందిన చౌటూరి కాంతమ్మ(55), స్థానిక ఏజెంటు షేక్ ఫయాజ్ ద్వారా 2016 సెప్టెంబరులో సౌదీ అరేబియాకు వెళ్లింది. రెండు నెలల తరువాత కుటుంబ సభ్యులకు ఫోన్చేసి యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని తనను తిరిగి స్వదేశానికి పిలిపించాలని వేడుకుంది. దీంతో ఆవేదన చెందిన కుటుంబసభ్యులు, ఆమెను వెనక్కు పిలిపించడానికి ఖర్చుల నిమిత్తం ఏజెంట్కు రూ.80వేలు చెల్లించారు. కానీ ఆతడి నుంచి స్పందన లేకపోవడంతో వారంతా గురువారం కావలి డీఎస్పీ రాఘవరావును కలసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







