రవితేజ కొత్త సినిమా 'టచ్ చేసి చూడు'
- May 25, 2017
రవితేజ స్పీడ్ పెంచారు. ఆ మధ్య నటనకి కొంత విరామం ఇచ్చిన ఆయన ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహిస్తున్న 'టచ్ చేసి చూడు' చిత్రం ఒకటి. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బేనరుపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ వచ్చే నెల 5న ప్రారంభం కానుంది. 20 రోజుల పాటు హైదరాబాద్, పాండిచ్చేరిలో జరిగే షూటింగ్లో కీలక సన్నివేశాలు, ఒక ఫైట్, ఛేజ్ చిత్రీకరిస్తామని నిర్మాతలు చెప్పారు. డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రవితేజ తన అభిమానుల్ని అలరించే అద్భుతమైన పాత్రను పోషిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









