రవితేజ కొత్త సినిమా 'టచ్ చేసి చూడు'
- May 25, 2017
రవితేజ స్పీడ్ పెంచారు. ఆ మధ్య నటనకి కొంత విరామం ఇచ్చిన ఆయన ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహిస్తున్న 'టచ్ చేసి చూడు' చిత్రం ఒకటి. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బేనరుపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ వచ్చే నెల 5న ప్రారంభం కానుంది. 20 రోజుల పాటు హైదరాబాద్, పాండిచ్చేరిలో జరిగే షూటింగ్లో కీలక సన్నివేశాలు, ఒక ఫైట్, ఛేజ్ చిత్రీకరిస్తామని నిర్మాతలు చెప్పారు. డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రవితేజ తన అభిమానుల్ని అలరించే అద్భుతమైన పాత్రను పోషిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







