తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగులు రంజాన్ మాసంలో గంట ముందే ఇంటికి

- May 25, 2017 , by Maagulf
తెలంగాణ లో  ప్రభుత్వ ఉద్యోగులు రంజాన్ మాసంలో గంట ముందే ఇంటికి

ముస్లిం సోదర సోదరీమణులకు అత్యంత పవిత్ర మాసమైన రంజాన్‌ ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో ఉద్యోగులకు ఓ గంటముందే ఇంటికి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. రంజాన్‌ ఉపవాస దీక్షలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నిర్ణీత సమయం కంటే గంట ముందే అంటే సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు వెళ్లడానికి అనుమతినిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ తెలిపారు. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com