మహా నటుడు ఎన్టీఆర్ కు భారతరత్న పై స్పందించిన మంత్రి కిరణ్ రిజిజు

- May 26, 2017 , by Maagulf
మహా నటుడు ఎన్టీఆర్ కు భారతరత్న పై స్పందించిన మంత్రి కిరణ్ రిజిజు

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది తెలుగు ప్రజల చిరకాల కోరిక. దీనిపై ప్రతీ యేడాది తెలుగు వాళ్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కేంద్రం ఏదో ఒక సాకు చెబుతూనే ఉంది. తాజాగా.. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఎన్టీఆర్ కు  భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ గతంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు రాసిన లేఖను పీఎంఓకు పంపించినట్టు ఆయన చెప్పారు. ప్రధాని కార్యాలయం ఆ లేఖను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందంటూ మరోసారి సమాధానం దాటేశారు కేంద్ర మంత్రి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com