షార్జాలో 1 బిలియన్ల దిర్హామ్లతో నివాస ప్రాజెక్టు ప్రారంభం
- May 26, 2017
షార్జా ఎమిరేట్లో 1 బిలియన్లదిర్హాములతో నివాస సముదాయం యొక్క డిజైన్లు షేఖ్ జాయెద్ హౌసింగ్ ప్రోగ్రాం చేత ఆవిష్కరించబడ్డాయి. పౌరులకు వసతి కల్పించటానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అల్-సౌహ్ '16' రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అతిపెద్ద గృహ ప్రాజెక్ట్ లో రూపొందించనుంది.ఈ కార్యక్రమంలో వాస్తుశిల్పి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొహమ్మద్ అల్ మన్సోరి మాట్లాడుతూ, 812-యూనిట్ ప్రాజెక్టును 1.3 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నామని, వీటిని 2020 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. "ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్ ఆమోదించబడింది మరియు పునాది కూడా పూర్తయింది. అల్ సయౌహ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ యొక్క సృజనాత్మకతో కూడిన , అధిక-నాణ్యత మరియు బలమైన -సమర్థవంతమైన నమూనాలు ఈ కార్యక్రమంలో అమలు చేయబడే పరిమాణం మరియు నిర్మాణ నమూనా పరంగా మొట్టమొదటివి. ఎమిరాటీ కుటుంబాల అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా ఉంది '' అని ఆయన అన్నారు.'ఇది ఒకే సమయంలో జీవన నాణ్యత, జీవనశైలిని మిళితం చేస్తుంది 'అని ఆయన చెప్పారు. ఈ ప్రణాళికలో 36 డబుల్ బెడ్ రూమ్ యూనిట్లు, 46 త్రిబుల్ బెడ్ రూమ్ యూనిట్లు మరియు 730 నాలుగు బెడ్ రూమ్ యూనిట్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







