భారత దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు

- May 26, 2017 , by Maagulf
భారత దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు

దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికల పోలీసులు అప్రమత్తం అయ్యారు. దేశంలోకి 21 మంది ఉగ్రవాదులు ప్రవేశించారని ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ముంబై, ఢిల్లీ టార్గెట్‌గా దాడులు జరిగే అవకాశాలున్నాయి. మెట్రో స్టేషన్లు, హోటళ్లను టార్గెట్‌ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
తాజా హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దేశంలోని ప్రధాన నగరాలలో తనీఖీలు తీవ్ర తరం చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు.
ఇంటిలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు పోలీసులకి సహకరించడంతో పాటు.. స్వీయ అప్రమత్తంగా ఉంటే మంచిందని సూచిస్తున్నారు. ముంబై, దిల్ సుఖ్ నగర్ లాంటి దాడులు పునరావుతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com