రమదాన్‌ కానుక: యూఏఈ థీమ్‌ పార్క్‌ సందర్శన ఉచితం

- May 27, 2017 , by Maagulf
రమదాన్‌ కానుక: యూఏఈ థీమ్‌ పార్క్‌ సందర్శన ఉచితం

రమదాన్‌ సంరద్భంగా యూఏఈలో పలు థీమ్‌ పార్క్స్‌ అద్భుతమైన ఆఫర్లను, డిస్కౌంట్లను పొందుపర్చి, పలు ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాయి. దుబాయ్‌కి చెందిన ఐఎంజి వరల్డ్స్‌, దుబాయ్‌ పార్క్‌లు మరియు రిసార్ట్‌లు రెసిడెంట్స్‌ని ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అబుదాబీకి చెందిన ఫెర్రారీ వరల్డ్‌ కూడా అద్భుతమైన ఆఫర్‌తో సందర్శకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సోషల్‌ మీడియా ద్వారా ఫెరారీ వరల్డ్‌ కత్త ఆఫర్‌ని ప్రకటించింది. రమదాన్‌ సందర్భంగా గురు, శుక్రవారాల్లో థీమ్‌ పార్క్‌లోకి ప్రవేశం ఉచితంగా కల్పిస్తారు. రాత్రి 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఉచిత సందర్శన ఉంటుంది. ఆ తర్వాత పెర్రీ వరల్డ్‌లో 'పే యాజ్‌ యూ గో' పద్ధతిన పలు రైడ్స్‌ సందర్శకులకు అందుబాటులో ఉంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com