ఆఫ్ఘన్ లో ఆత్మాహుతి దాడి
- May 27, 2017
కాబూల్: ఆఫ్గనిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. కారు బాంబ్ ఆత్మాహుతి దాడిలో సుమారు 18 మంది దుర్మరణం చెందారు. మరణించినవారిలో 10మంది భద్రతా సిబ్బందితో పాటు ఎనిమిది మంది సామాన్య పౌరులు ఉన్నారు. మరో ఆరుగురు గాయపడ్డారు.
ఖోస్ట్ ప్రావిన్స్లోని అత్యంత రద్దీ ప్రాంతంలో శనివారం ఈ కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీస్ చీఫ్ జనరల్ ఫైజులుల్లా తెలిపారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని చెప్పారు. రందాన్ ప్రారంభం అయిన తొలిరోజే ఉగ్రవాదులు ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









