హైదరాబాద్లో మరో సిగ్నేచర్ టవర్స్
- May 27, 2017
హైదరాబాద్లో మరో ఐటీ టవర్ రానుంది. సిగ్నేచర్ టవర్స్ ను నిర్మించేందుకు ఐటీ సర్వ్ సంస్థ ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. శాంటాక్లారాలో ఐటీ, డాటా, గేమింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణలో ఉన్న అవకాశాల గురించి వారికి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను వివరించారు. ఈ సందర్భంగా ఐటీ సర్వ్ అలయన్స్ సంస్థ.. హైదరాబాద్లో టవర్ నిర్మాణానికి ముందుకొచ్చింది. ఆ సంస్థ ప్రతినిధుల విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.
మరోవైపు డెల్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అయిన వీఎం వేర్ ప్రతినిధులతోనూ మంత్రి భేటీ అయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, మూల్యాంకనంలో డాటా అనలిటిక్స్ను తెలంగాణ ప్రభుత్వం వినియోగిస్తున్న తీరును వివరించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న డాటా అనలిస్టిక్ పార్క్లో ప్రధాన పెట్టుబడిదారుగా ఉండాలని, రాష్ట్రానికి ప్రతినిధుల బృందాన్ని పంపాలని వీఎం వేర్ సంస్థ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. అలాగే ఎలక్ర్టానిక్స్ ఆర్ట్స్ కంపెనీ ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. ఎంటర్టైన్మెంట్, గేమింగ్ రంగాల్లో హైదరాబాద్లో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. హాలీవుడ్ సినిమాలకు కూడా హైదరాబాద్లో యానిమేషన్ వర్క్ జరుగుతోందని వివరించారు. తెలంగాణ పారిశ్రామిక విధానంలో గేమింగ్ కోసం ప్రత్యేక పాలసీ ఉందన్నారు. హైదరాబాద్లో గేమ్ సిటీని ఏర్పాటుచేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని కేటీఆర్ వివరించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









