హైదరాబాద్లో మరో సిగ్నేచర్ టవర్స్
- May 27, 2017
హైదరాబాద్లో మరో ఐటీ టవర్ రానుంది. సిగ్నేచర్ టవర్స్ ను నిర్మించేందుకు ఐటీ సర్వ్ సంస్థ ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. శాంటాక్లారాలో ఐటీ, డాటా, గేమింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణలో ఉన్న అవకాశాల గురించి వారికి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను వివరించారు. ఈ సందర్భంగా ఐటీ సర్వ్ అలయన్స్ సంస్థ.. హైదరాబాద్లో టవర్ నిర్మాణానికి ముందుకొచ్చింది. ఆ సంస్థ ప్రతినిధుల విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.
మరోవైపు డెల్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అయిన వీఎం వేర్ ప్రతినిధులతోనూ మంత్రి భేటీ అయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, మూల్యాంకనంలో డాటా అనలిటిక్స్ను తెలంగాణ ప్రభుత్వం వినియోగిస్తున్న తీరును వివరించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న డాటా అనలిస్టిక్ పార్క్లో ప్రధాన పెట్టుబడిదారుగా ఉండాలని, రాష్ట్రానికి ప్రతినిధుల బృందాన్ని పంపాలని వీఎం వేర్ సంస్థ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. అలాగే ఎలక్ర్టానిక్స్ ఆర్ట్స్ కంపెనీ ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. ఎంటర్టైన్మెంట్, గేమింగ్ రంగాల్లో హైదరాబాద్లో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. హాలీవుడ్ సినిమాలకు కూడా హైదరాబాద్లో యానిమేషన్ వర్క్ జరుగుతోందని వివరించారు. తెలంగాణ పారిశ్రామిక విధానంలో గేమింగ్ కోసం ప్రత్యేక పాలసీ ఉందన్నారు. హైదరాబాద్లో గేమ్ సిటీని ఏర్పాటుచేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని కేటీఆర్ వివరించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







