కేరళలోని యుఎఇ కాన్సులేట్ జనరల్ వద్ద అనాధలకు ఖర్జూరాలు పంపిణీ

- May 27, 2017 , by Maagulf
కేరళలోని యుఎఇ కాన్సులేట్ జనరల్ వద్ద అనాధలకు ఖర్జూరాలు  పంపిణీ

అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రారంభించిన కేరళా లోని యుఎఇ కాన్సులేట్ జనరల్ ఒక సంవత్సరానికి  చేరుకొంది. ఇందుకు ప్రతిస్పందనగా కేరళ ప్రభుత్వంతో సహకారంతో, కేరళలోని ఇండియన్ స్టేట్ ఆఫ్ యుఎఇ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ప్రీమియం ఎమిరాటీ ఖర్జూరాలను లో త్రివేండ్రం నగరంలోని అనాధలకు పంచిపెట్టారు. ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ సహకారంతో ఈ కార్యక్రమం  శుక్రవారం జరిగింది, ఇది  రమదాన్ పవిత్ర నెలలో మరియు కేరళ ముఖ్యమంత్రి పినారాయ్ విజయన్ కేరళ  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కాబడిన సందర్భాన్ని పునస్కరించుకొని  మొదటి వార్షికోత్సవం ఏర్పాటుచేసిన  సందర్భంగా జరుగుతుంది. కేరళలోని యుఎఇ కాన్సులేట్ జనరల్ యొక్క కాన్సుల్-జనరల్ జమాల్ హుస్సేన్ అల్ జైబీ,  ప్రత్యేక అవసరాలున్న ప్రజలు మరియు కేరళ మసీదులతో సహా సుమారు 40,000 మందికి  ఖర్జురాల పంపిణీ పర్యవేక్షణలో ఉన్నారు. వీరిలో 30 మంది అనాధలు, ప్రజలు ఈ సహాయం నుండి లాభం పొందుతారు. యూఏఈ  మరియు కేరళకు మధ్య ఉన్న బలమైన మరియు చారిత్రాత్మక సంబంధాల పట్ల  అల్ జహాబి తన గర్వం వ్యక్తం చేశారు. అధ్యక్షులు గౌరవనీయ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రారంభించిన చొరవ కారణంగా కేరళలోని యుఎఇ కాన్సులేట్ ఒక ఏడాది అడుగుపెడుతున్న సందర్భానికి ప్రతిస్పందనగా ఎమిరేటిస్ యొక్క ఆతిథ్యం మరియు ఔదార్యత ఫలితంగా ఆయన ఈ చర్యను చేపట్టారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com