'కళానిలయం' మూడో వార్షికోత్సవం జూన్ 4న
- May 28, 2017
ముంబయి: ముంబయిలోని కళానిలయం మూడో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 4న నవీ ముంబయి వాషిలోని సెక్టార్-16 లోని విష్ణుదాస్ భవే ఆడిటోరియం లో జరగనుంది. ఈ సంధర్బంగా ఈటీవీ జబర్దస్త్ బృందం చమ్మక్ చంద్ర,రచ్చ రవి, సాయి బృందం ప్రదర్శించనున్నారు.సినీ గీత విభావరి,నృత్య ప్రదర్శనలు ఉంటాయని కళానిలయం చైర్మన్ పి.సుజాత రావు తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్పెషల్ గెస్ట్ గా విచ్చేయనున్నారు.ఈ సంధర్బంగా మేరీ మాక్ మోహన్ పాల్(భారత నాట్యం)కు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేయనున్నారు.డాక్టర్ శైలజ దేశాయ్(కూచిపూడి),చలపతి రావు(యాంకర్),రామ్ భీమన(దర్శకుడు),సిరాశ్రీ(లిరిసిస్ట్),సుభాషిణి(కమెడియన్),మిస్ అంజనీ(యంగ్ లెంట్),రాజ్ మిసల్ (యంగ్ టాలెంట్)లకు కళానిలయం పురస్కారాలు అందజేయనున్నారు.ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగు వారు పాల్గొని విజయవంతం చేయలని పి.సుజాత రావు,పి.సుధాకర రావు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







