బాలీవుడ్ నటుడు అక్షయ్,సైనాలకు మావోయిస్టుల హెచ్చరిక
- May 29, 2017
బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్కు మావోయిస్టుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. అక్షయ్ ఇటీవల జవాన్ల కోసం ‘భారత్ కా వీర్’ పేరిట వెబ్సైట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్సైట్ ద్వారా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు.
సైనా నెహ్వాల్ కూడా మార్చిలో సుకుమా జిల్లాలో జరిగిన నక్సలైట్ల దాడుల్లో అమరవీరులైన 12 మంది జవాన్ల కుటుంబాలకు రూ.9లక్షలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్గడ్లోని దక్షిణ బస్తర్ జిల్లాలో ఆదివారం పోలీసులకు కరపత్రాలు లభించాయి. దీనిలో అక్షయ్, సైనాలు జవాన్ల కుటుంబాలకు సాయం చేయకూడదని హిందీ, గోండి భాషల్లో రాసుంది. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం వెల్లడించారు. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు అక్షయ్ నుంచి కానీ సైనా నుంచి కానీ ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







