హెచ్పీ మరియు కేపీఎంజీ నుంచి జీఎస్టీ సొల్యూషన్స్
- May 29, 2017
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి రానుండటంతో హెచ్పీ సంస్థ దీనికి సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేపీఎంజీతో కలిసి కొత్త ల్యాప్ట్యాప్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. జీఎస్టీ సొల్యూషన్స్ పేరుతో జూన్ 5వ తేదీ నుంచి విక్రయించనున్న ఈ ల్యాప్టాప్ల ధర రూ.33,990గా నిర్ణయించారు. చిన్న మధ్యశ్రేణి వ్యాపార సంస్థల జీఎస్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీనిని తయారు చేసినట్లు హెచ్పీ చెబుతోంది. కొత్త పన్ను విధానాల ప్రకారం వ్యాపారుల లావాదేవీలను ఫైల్ చేయడానికి వీలుగా దీనిలో ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల కోసం హెచ్పీ ప్రత్యేక హెల్ప్డెస్క్ను కూడా ఏర్పాటు చేసింది. మొబైల్ నంబర్లు, ఈ-మెయిల్ చిరునామాలు, చాట్ల ద్వారా పన్ను నిపుణులు అందుబాటులో ఉంటారు. ఈ బృందం 24నెలల పాటు వ్యాపారులకు సహాయ సహకారాలు అందిస్తుంది. దీని కొనుగోలుదారులకు హెచ్పీ శిక్షణ కూడా ఇవ్వనుంది. వీటిని హెచ్పీ స్టోర్లలో, హెచ్పీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
పన్నుల వ్యవస్థలో జీఎస్టీ వంటి భారీ మార్పు చోటు చేసుకుంటున్నప్పుడు దానికి అనుగుణంగా వినియోగదారుల వ్యవహారాలు సులభతరం అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని హెచ్పీ ఎండీ సుమీర్ చంద్ర తెలిపారు. జీఎస్టీ వల్ల 60లక్షల మంది చిన్న మధ్య శ్రేణి వ్యాపారులపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో అవసరమైన సాఫ్ట్వేర్ పరమైన ఇబ్బందులను ఎదుర్కొవడానికి హెచ్పీతో చేతులు కలిపి జీఎస్టీ సొల్యూషన్స్ను ఆవిష్కరించినట్లు కేపీఎంజీ సీఈవో అంకుర్ కుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









