రమదాన్కి 300 డ్రోన్స్తో స్వాగతం
- May 29, 2017
జెడ్డా: జనరల్ అథారిటీ ఫర్ ఎంటర్టైన్మెంట్ (జిఇఎ), పవిత్ర రమదాన్ మాసానికి కొత్త తరహాలో స్వాగతం పలికింది. 300 డ్రోన్లకు అమర్చిన లైట్స్ ద్వారా స్వాగతం పలకడం సరికొత్త అనుభూతి. ఆకాశంలో డ్రోన్లు ఎగురుతూ లైట్లు దర్శనమివ్వడంతో వీక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అరబిక్లో రమదాన్ శుభాకాంక్షల్ని పేర్కొంటూ డ్రోన్లను ఆకాశంలోకి పంపించారు. రంగు రంగుల లైట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెనా రీజియన్లో ఇంతవరకు ఈ తరహా ప్రయత్నం ఎవరూ చేయలేదని నిర్వాహకులు తెలిపారు. కొత్తదనంతో కూడిన ఆలోచన చేసి కొత్తగా రమదాన్ శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ముందస్తుగానే తెలుసుకున్నప్పటికీ, ఈ స్థాయిలో కొత్తదనం ప్రదర్శిస్తారని అనుకోలదంటూ పలువురు సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంటర్టైన్మెంట్ అథారిటీ పవిత్ర రమదాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్నింటిని చేపట్టనుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







