రమదాన్కి 300 డ్రోన్స్తో స్వాగతం
- May 29, 2017
జెడ్డా: జనరల్ అథారిటీ ఫర్ ఎంటర్టైన్మెంట్ (జిఇఎ), పవిత్ర రమదాన్ మాసానికి కొత్త తరహాలో స్వాగతం పలికింది. 300 డ్రోన్లకు అమర్చిన లైట్స్ ద్వారా స్వాగతం పలకడం సరికొత్త అనుభూతి. ఆకాశంలో డ్రోన్లు ఎగురుతూ లైట్లు దర్శనమివ్వడంతో వీక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అరబిక్లో రమదాన్ శుభాకాంక్షల్ని పేర్కొంటూ డ్రోన్లను ఆకాశంలోకి పంపించారు. రంగు రంగుల లైట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెనా రీజియన్లో ఇంతవరకు ఈ తరహా ప్రయత్నం ఎవరూ చేయలేదని నిర్వాహకులు తెలిపారు. కొత్తదనంతో కూడిన ఆలోచన చేసి కొత్తగా రమదాన్ శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ముందస్తుగానే తెలుసుకున్నప్పటికీ, ఈ స్థాయిలో కొత్తదనం ప్రదర్శిస్తారని అనుకోలదంటూ పలువురు సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంటర్టైన్మెంట్ అథారిటీ పవిత్ర రమదాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్నింటిని చేపట్టనుంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









