ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఉగ్రదాడి: ఎనిమిది మంది మృతి

- May 29, 2017 , by Maagulf
ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఉగ్రదాడి: ఎనిమిది మంది మృతి

 ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో మరోమారు ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కరాడా సెంట్రల్‌లో గల ఓ ఐస్‌క్రీం పార్లర్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. 22 మందికి పైగా గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే పార్లర్‌లో ప్రజలే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాంబు దాడి అనంతరం ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. గాయాలపాలైన వారి ఆర్తనాదాలు, రోదనలతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com