విజయదశమికి మహేశ్ కథానాయకుడిగా 'స్పైడర్'
- May 29, 2017
మహేశ్ కథానాయకుడిగా ఎ.ఆర్. మురుగదాస్ రూపొందిస్తోన్న 'స్పైడర్' సినిమా విజయదశమికి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా మహేశ వెల్లడించారు. ''ఈ దసరాకి మీ వద్దకు 'స్పైడర్' వస్తోంది. దీనికి సంబంధించి మే 31 (కృష్ణ పుట్టినరోజు) సాయంత్రం ఐదు గంటలకు వచ్చే ఫస్ట్ టీజర్తో పార్టీ మొదలవుతుంది'' అని ఆయన ట్వీట్ చేశారు. రకుల్ప్రీత్ సింగ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లియో ప్రొడక్షన్స్, ఎన్వీఆర్ సినిమా పతాకాలపై ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య ప్రతినాయక పాత్రను పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తయారవుతున్న ఈ చిత్రంలో మహేశ్ ఇంటలిజెన్స్ ఆఫీసర్గా నటిస్తున్నారు. మురుగదాస్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్లు ఒక కాన్సెప్ట్ తో కనిపిస్తాయి. అదే తరహాలో ఈ సినిమాలోనూ యాక్షన్ పార్టులను చాలా శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నారు మురుగదాస్. ఈ చిత్రానికి పీటర్ హెయిన్స్, కణల్ కణ్ణన్, అన్బరివ్ ('కబాలి' ఫేమ్) యాక్షన్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. హారిస్ జయరాజ్ స్వరాలు కూరుస్తున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









