రెండు తెలుగు రాష్ర్టాల్లో హోటళ్లు బంద్
- May 29, 2017
జులై ఒకటి నుంచి అమలుకానున్న కొత్త వస్తుసేవల పన్ను-జీఎస్టీలో హోటళ్లపై విధించిన 18శాతం పన్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు బంద్
పాటించాలని ఆ సంఘం నిర్ణయించింది. దీనికి దక్షిణాది రాష్ట్రాల హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం కూడా మద్దతు తెలిపింది.
కొత్త పన్నుతో వినియోగదారులపై మరింత భారంపడే ప్రమాదముందని, దీనికారణంగా ఈ సెక్టార్ దివాలా తీయడం ఖాయమని అంటున్నారు సంఘం నేతలు.
ఇప్పటివరకు కేరళ, కర్ణాటకల్లో హోటళ్లు, రెస్టారెంట్లపై ఎలాంటి పన్నులేదని, తమిళనాడులో కేవలం 2శాతం పన్ను మాత్రమే విధించేవారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు 18 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్ల ఇండస్ర్టీ వల్ల సుమారు 40 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. వందల కోట్ల రూపాయలు పన్ను చెల్లిస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి వస్తే అదనంగా రూ.1500 కోట్లు కట్టాల్సి వస్తుందని వాపోయారు సంఘం నేతలు. ఇదే సమయంలో వివిధ దేశాల్లో హోటళ్లపై పన్ను చాలా తక్కువగా వుందని నేతలు గుర్తు చేశారు.
థాయ్లాండ్-5 శాతం, యూఏఈ-5, అమెరికా-7.5, సింగపూర్-7, జపాన్- 8 శాతం వుందంటున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







