జర్మన్ఛాన్సలర్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
- May 29, 2017
నాలుగు దేశాల పర్యటనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జర్మనీతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ దేశ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్తో మంగళవారం భేటీ అయ్యారు. మెర్కెల్ తన అధికారిక నివాసం స్కాలస్ మెసెబర్గ్లో ఈ ఉదయం ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మెసెబర్గ్ లాన్లో నడుస్తూ కాసేపు ముచ్చటించారు.
అనంతరం మెర్కెల్, మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. పెట్టుబడులు, సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదిరత అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరు, దేశ భద్రత గురించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మెర్కెల్తో భేటీపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘గుడ్ ఇంటారక్షన్’గా పేర్కొన్నారు. మెసెబర్గ్ లాన్లో మెర్కెల్ మాట్లాడుతున్న ఉన్న ఫొటోలను ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
భేటీ అనంతరం ఏంజెలా ఏర్పాటుచేసిన అధికారిక విందులో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత జర్మనీలోని ప్రముఖ వాణిజ్యవేత్తలతో సమావేశమవుతారు. ప్రధాని రెండు రోజుల పాటు జర్మనీలో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









