జర్మన్ఛాన్సలర్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
- May 29, 2017
నాలుగు దేశాల పర్యటనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జర్మనీతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ దేశ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్తో మంగళవారం భేటీ అయ్యారు. మెర్కెల్ తన అధికారిక నివాసం స్కాలస్ మెసెబర్గ్లో ఈ ఉదయం ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మెసెబర్గ్ లాన్లో నడుస్తూ కాసేపు ముచ్చటించారు.
అనంతరం మెర్కెల్, మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. పెట్టుబడులు, సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదిరత అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరు, దేశ భద్రత గురించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మెర్కెల్తో భేటీపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘గుడ్ ఇంటారక్షన్’గా పేర్కొన్నారు. మెసెబర్గ్ లాన్లో మెర్కెల్ మాట్లాడుతున్న ఉన్న ఫొటోలను ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
భేటీ అనంతరం ఏంజెలా ఏర్పాటుచేసిన అధికారిక విందులో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత జర్మనీలోని ప్రముఖ వాణిజ్యవేత్తలతో సమావేశమవుతారు. ప్రధాని రెండు రోజుల పాటు జర్మనీలో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







