జర్మన్ఛాన్సలర్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
- May 29, 2017
నాలుగు దేశాల పర్యటనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జర్మనీతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ దేశ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్తో మంగళవారం భేటీ అయ్యారు. మెర్కెల్ తన అధికారిక నివాసం స్కాలస్ మెసెబర్గ్లో ఈ ఉదయం ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మెసెబర్గ్ లాన్లో నడుస్తూ కాసేపు ముచ్చటించారు.
అనంతరం మెర్కెల్, మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. పెట్టుబడులు, సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదిరత అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరు, దేశ భద్రత గురించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మెర్కెల్తో భేటీపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘గుడ్ ఇంటారక్షన్’గా పేర్కొన్నారు. మెసెబర్గ్ లాన్లో మెర్కెల్ మాట్లాడుతున్న ఉన్న ఫొటోలను ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
భేటీ అనంతరం ఏంజెలా ఏర్పాటుచేసిన అధికారిక విందులో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత జర్మనీలోని ప్రముఖ వాణిజ్యవేత్తలతో సమావేశమవుతారు. ప్రధాని రెండు రోజుల పాటు జర్మనీలో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









