బరువును తగ్గించే డ్రింక్స్.. ట్రై చేయండి
- May 29, 2017
బరువు తగ్గాలా? అయితే ఈ డ్రింక్స్ రోజూ తీసుకోండి. రాత్రిపూట ఒకప్పు గోరు వెచ్చని నీటిలో అర స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు స్పూన్ల తేనెని వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని గంట పాటు అలానే ఉంచి.. సగం కప్పును రాత్రి పూట భోజనం చేసిన ముప్పావుగంట తర్వాత తాగాలి. ఉదయం పూట పరగడుపున మిగిలిన అరకప్పు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి. తద్వారా బరువు తగ్గిపోతుంది.
అలాగే
ఒక కప్పు గోరు వెచ్చని నీరు,
ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి
ఒక టేబుల్ స్పూన్ తేనె,
ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని ఓ పాత్రలో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని రోజుకోసారి తాగితే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. అధిక బరువు సమస్య దూరమవుతుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







