మేడారం సమక్క సారలమ్మ జాతర

- October 09, 2015 , by Maagulf
మేడారం సమక్క సారలమ్మ జాతర

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్య,సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.101 కోట్లను కేటాయించింది.ఈ మేరకు జాతర ఏర్పాట్ల కోసం 18 శాఖలకు సంబంధించి రూ.101 కోట్లతో నిర్వహించే ఆయా పనులకు గురువారం పరిపాలనా అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది.రెండేళ్ళకోసారి జరిగే మేడారం సమ్మక్య సారలమ్మ జాతరకు దాదాపు కోటి మంది దాకా భక్తులు విచ్చేస్తారు.గిరిజన గుంభమేళగా పిలువబడే ఈ జాతరకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,చత్తీస్‌ఘడ్,మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ,రాష్ట్రాల నుంచి భక్తుల విచ్చేస్తారు.మెత్తం మొత్తం నాలుగు రోజులపాటు ఈ జాతర జరగనుంది.ఈ సమయంలో మేడారం గ్రామానికి 30 కిలోమీటర్ల దూరం నుంచే జనసందోహం నిండి ఉంటుంది..కాగా ..జాతరకు మరో ఐదునెలల సమయం ఉండగానే ఇప్పటినుంచే ఆయా పనుల నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.దీనిలో భాగంగా రూ.101కోట్లు ఆయా పనుల నిర్వహణకుగాను పరిపాలనా అనుమతులను గురువారం ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com