తెలంగాణ టీవీ అండ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా రామ్ మోహన్ ఎంపిక
- May 29, 2017
తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ అండ్ టీవీ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పుస్కూర్ రామ్ మోహన్రావును నియమిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించారు. సుధీర్ఘకాలంగా చిత్రసీమకు ఆయన చేస్తున్న సేవలకు గాను రామ్ మోహన్రావును ఈ పదవి వరించింది. మల్టీడైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్ అధినేతగా వ్యవహరిస్తున్న రామ్మోహన్రావు 31 ఏళ్లుగా చలన చిత్ర పరిశ్రమ పురోభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో 25 చిత్రాల్ని నిర్మించారు. డిజిటలైజేషన్ సాంకేతిక విధానాన్ని తొలిసారిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు పరిచయం చేశారాయన. పంపిణీదారుడిగా ఆయనకు విశేష అనుభవముంది. డిస్ట్రిబ్యూటర్గా పదేళ్ల ప్రయాణంలో దేశవ్యాప్తంగా 250కిపైగా సినిమాలను విడుదలచేశారు. 1993-95లో కేంద్ర సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా ఆయన సేవలందించారు. అదే సమయంలో ది హైదరాబాద్ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు సెక్రటరీగా వ్యహరించారు రామ్ మోహన్రావు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. రాష్ట్ర ఫిల్మ్ అండ్ టీవీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితుడవడం పట్ల రామ్ మోహన్రావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, సినిమా నిర్మాతగా చిత్రపరిశ్రమతో నాకు ముఫ్ఫై ఏళ్లుగా అనుబంధముంది. సినీ పరిశ్రమలోని లోతుపాతులు, సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉంది. పదవి రావడం కొత్తగా అనిపించడం లేదు. కుటుంబం లాంటి చిత్ర పరిశ్రమతో ఇంకా అనుబంధం పెంచుకోవడానికి ఈ పదవి దోహదపడుతుందని భావిస్తున్నాను. ముఖ్యమంత్రి సహకారంతో భవిష్యత్లో తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడతాను అని తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







