ఐటీ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నమంత్రి కేటీఆర్

- May 29, 2017 , by Maagulf
ఐటీ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నమంత్రి కేటీఆర్

తెలంగాణలో ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి.. ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా కేటీఆర్ కాలిఫోర్నియాలో పర్యటించారు. శాంటాక్లారాలోని ఐటీ సర్వ్‌ అలయెన్స్‌ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఐటీ కంపెనీలు రెండుసార్లు పన్నులు కట్టకుండా.. రాయితీలు ఇచ్చే అంశంపై కేంద్రంతో చర్చిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తే.. పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమని.. ఐటీ సర్వ్ అలయెన్స్ ప్రతినిధులు హర్షా రెడ్డి తదితరులు కేటీఆర్‌కు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com