వికటించిన సర్జరీ: 900,000 దిర్హామ్ల నష్టపరిహారం
- May 30, 2017
యు.ఏ.ఈ :హెర్నియా ఆపరేషన్ వికటించడంతో టెస్టికల్స్ కోల్పోయిన అరబ్ పేషెంట్కి 900,000 దిర్హామ్ల నష్టపరిహారం అందించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. అబుదాబీ ఫెడరల్ సుప్రీంకోర్టు, ఈ తీర్పునిచ్చింది. కింది కోర్టు, బాధితుడికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించగా, నష్టపరిహారాన్ని ఫెడరల్ సుప్రీంకోర్టు దాన్ని సమర్థించింది. టెస్టీస్లో హెర్నియా సమస్యతో బాధపడుతున్న బాధితుడు, ఆసుపత్రిని ఆశ్రయించగా, ఆపరేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయకుండానే బాధితుడికి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం కూడా నొప్పి తగ్గకపోవడంతో మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళగా, అల్ట్రాసౌండ్ స్కానింగ్లో టెస్టీస్లో సమస్య తీవ్రతరమయినట్లు గుర్తించారు. మరో ఆసుపత్రికి వెళ్ళి బాధితుడు, టెస్టీస్ని తొలగించుకున్నాడు. సెక్సువల్ ఫంక్షన్కి కూడా పనికిరాకుండా పోయిన బాధితుడు, ఈ నష్టానికి కారణం తనకు తొలుత శస్త్ర చికిత్స చేసిన వైద్యులేనని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









