ఇళ్ళకు కన్నాలు వేస్తున్న ఐదుగురు నిర్వాసితులు
- May 30, 2017
బతుకుతెరువు కోసం పరాయి దేశం వెళ్ళి ఉద్యోగమో ..సద్యోగమో చూసుకోక ...ఓ అయిదుగురు ప్రవాసీయులు తమ చోరకళను ప్రదర్శించారు..అందుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు. దోహా నేర న్యాయస్థానం ఒకొక్కరికి మూడు సంవత్సరాల జైలుశిక్ష అనంతరం దేశ బహిష్కరణ శిక్ష విధించింది. ఈ నిందితులు అనేక గృహాలను విచ్ఛిన్నం చేసి తరువాతి ఆ ఇళ్ళల్లో డబ్బు మరియు ఆభరణాలు దొంగిలించేవారని పోలీసులు నివేదించారు. ఓ బాధితుడు విదేశాల్లో పర్యటన ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన ఆయన తన వంటగది తలుపు విరిగి ఉండటం బంగారు ఆభరణాలతో పాటు 6,000 కతర్ రియాళ్ళు అపహరణకు గురైనట్లు గుర్తించి లబోదిబోమని స్థానిక పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ కేసు పై దర్యాప్తు ప్రారంభమైంది. పోలీసుల పరిశోధనలలో ఓ ఐదుగురు ముద్దాయిల బృందం ఈ దొంగతనాలకు సూత్రకర్తలుగా నిర్ధారించారు. వీరు పలు వీధులలో తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను ఎంతో శ్రద్ధగా పరిశీలించేవారు ..ఆయా ఇంటి యజమానులు బైటకు వెళ్లినప్పుడో..లేక వారు దేశం వెలుపల పర్యటనల కోసం వెళ్లిన తర్వాత ఆ ఇళ్లను చూడటం...ఆ తర్వాత ఎవరూ గమనించని సమయంలో ఆ ఇంటి లోనికి చొరబడి ఎంచక్కా దోచుకొనేవారు. పోలీసుల పరిశోధనలలో ఈ అయిదుగురు ప్రవాసీయులు ఇదే తరహాలో పలు దొంగతనాలు చేసినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









