ఇళ్ళకు కన్నాలు వేస్తున్న ఐదుగురు నిర్వాసితులు
- May 30, 2017
బతుకుతెరువు కోసం పరాయి దేశం వెళ్ళి ఉద్యోగమో ..సద్యోగమో చూసుకోక ...ఓ అయిదుగురు ప్రవాసీయులు తమ చోరకళను ప్రదర్శించారు..అందుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు. దోహా నేర న్యాయస్థానం ఒకొక్కరికి మూడు సంవత్సరాల జైలుశిక్ష అనంతరం దేశ బహిష్కరణ శిక్ష విధించింది. ఈ నిందితులు అనేక గృహాలను విచ్ఛిన్నం చేసి తరువాతి ఆ ఇళ్ళల్లో డబ్బు మరియు ఆభరణాలు దొంగిలించేవారని పోలీసులు నివేదించారు. ఓ బాధితుడు విదేశాల్లో పర్యటన ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన ఆయన తన వంటగది తలుపు విరిగి ఉండటం బంగారు ఆభరణాలతో పాటు 6,000 కతర్ రియాళ్ళు అపహరణకు గురైనట్లు గుర్తించి లబోదిబోమని స్థానిక పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ కేసు పై దర్యాప్తు ప్రారంభమైంది. పోలీసుల పరిశోధనలలో ఓ ఐదుగురు ముద్దాయిల బృందం ఈ దొంగతనాలకు సూత్రకర్తలుగా నిర్ధారించారు. వీరు పలు వీధులలో తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను ఎంతో శ్రద్ధగా పరిశీలించేవారు ..ఆయా ఇంటి యజమానులు బైటకు వెళ్లినప్పుడో..లేక వారు దేశం వెలుపల పర్యటనల కోసం వెళ్లిన తర్వాత ఆ ఇళ్లను చూడటం...ఆ తర్వాత ఎవరూ గమనించని సమయంలో ఆ ఇంటి లోనికి చొరబడి ఎంచక్కా దోచుకొనేవారు. పోలీసుల పరిశోధనలలో ఈ అయిదుగురు ప్రవాసీయులు ఇదే తరహాలో పలు దొంగతనాలు చేసినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







